థియేటర్ కంటే కిరాణా కొట్టు కలెక్షన్ ఎక్కువ

ఏపీలో టికెట్ రేట్లు తగ్గించడంపై సినీ జనాల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. కానీ ఎవ్వరు బయటపడటం లేదు. బరస్ట్ కావడం లేదు. ఏది చెప్పిన కూల్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వాన్ని మంచిక చేసుకొని పని చేసుకోవాలన్న ఫార్ములాని ఫాలో అవుతున్నరు. అయితే నేచురల్ స్టార్ నాని ఏపీ ప్రభుత్వం తీరుని తప్పుబట్టారు.

” సినిమా టికెట్ విషయంలో.. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అది కరెక్ట్ కాదు. అది మనందరికీ తెలుసు. రేపే నా సినిమా రిలీజ్ కాబట్టి, ఇప్పుడు ఏది మాట్లాడినా వివాదమే అవుతుంది. సినిమాలు, రాజకీయాలను పక్కనపెడితే.. మీరు ప్రేక్షకులను అవమానపరుస్తున్నారు. 10 మందికి ఉద్యోగం ఇచ్చే థియేటర్ కంటే పక్కనే ఉన్న కిరాణా కొట్టు కలెక్షన్ ఎక్కువగా ఉంటోంది. టికెట్ ధరలు పెంచినా.. కొని సినిమా చూసే సామర్థ్యం ప్రేక్షకులకు ఉంది.” అన్నారు నాని. ఇక రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో శ్యామ్ సింగ రాయ్ తెరకెక్కింది.  సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలు. ఈ చిత్రం రేపే (డిసెంబరు 24) విడుదలకానుంది.