సంక్రాంతి రేస్ లో బోల్డ్ సినిమా.

ఈ యాడాది సంక్రాంతి బరిలొకి దిగడానికి పెద్ద సినిమాలతొ  పాటు చిన్న సినిమాలూ  కూడా పోటీ పడుతున్నాయి. పాన్ ఇండియా సినిమాలు  ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’  విడుదలకు రెడీ అవుతున్నాయి.  విమల్ కృష్ణ  దర్శకత్వంలో   యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన  ‘డీజే టిల్లు’ కుడా విడుదలకు సిద్దమవుతుందని సినీ వర్గాల సమాచారం.  ఈ చిత్రాన్ని  రొమాంటిక్ డ్రామాగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై  సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.  దీనిలో బోల్డ్ సీన్స్ చాలానే ఉన్నాయి. పాన్ ఇండియా సినిమాలతో పోటీగా ఇప్పుడు సడెన్ గా ఓ చిన్న సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకోవడం ఆశ్చర్యంగా ఉంది. దీంతో పాటు నాగార్జున నటించిన ‘బంగార్రాజు’ కూడా సంక్రాంతికి విడుదల కాబోతుంది.

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ విడుదలవుతాయా..? లేదా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. దానికి కారణం కరోనా మహమ్మారి. చాలా రాష్ట్రాల్లో కరోనా మూడో దశ ప్రభావం చూపిస్తోంది. ముంబై లాంటి సిటీల్లో ప్రభుత్వం కర్ఫ్యూలు కూడా విధించింది. థియేటర్లలో యాభై శాతం ఆక్యుపెన్సీ విధించారు. తమిళనాడు, కర్ణాటక కూడా ఇదే రూట్ ను ఫాలో అవుతాయని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నిర్మాతల్లో టెన్షన్ నెలకొంది.