‘బుక్ మై షో’లో పుష్ప రికార్డ్

అల్లు అర్జున్  . రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం  ‘ పుష్ప’.   సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.  మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా ,  దేవీ శ్రీ ప్రసాద్  సంగీతం అందించాడు. సునీల్, అనసూయ ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ రోల్స్‌ను చేశారు. ఈ సినిమా విడుదలై నిన్నటికి ఎనిమిది రోజులు పూర్తయ్యాయి.

ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించి బుక్‌మైషోలో 3.50 మిలియన్ టికెట్లు అమ్ముడయ్యాయి.  అక్షరాలా 35 లక్షల మంది బుక్‌మైషో ద్వారా ఈ సినిమాను వీక్షించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ ఏ సినిమాకూ ఈ రేంజ్‌లో టికెట్లు అమ్ముడవలేదు. దీంతో బన్నీ మూవీ పేరిట నేషనల్ రికార్డు నమోదైంది. ఇదిలా ఉండగానే తాజాగా పుష్ప మూవీ నేషనల్ రికార్డు నెలకొల్పి వార్తల్లో నిలిచింది.  ఆర్య , ఆర్య 2 తర్వాత సుక్కు – బన్నీ ల కాంబినేషన్ లో  వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతూ దూసుకెళ్తుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సక్సెస్ సంబరాలు జరుపుకుంతుంది.