డైరెక్టర్స్ కు ‘పుష్ప’ పార్టీ

పార్టీ లేదా పుష్పా ? అని అడగటానికి ఛాన్సే లేదు. పుష్ప టీమ్ వరుసపెట్టి పార్టీలు ఇస్తోంది. తాజాగా డైరెక్టర్స్ అందరికీ పుష్ప టీమ్ మస్త్ దావత్ ఇచ్చింది. ఈ దావత్ కి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో పాటుగా టాప్ దర్శకులు, యువ డైరెక్టర్స్ హాజరయ్యారు. మస్త్ గా ఎంజాయ్ చేశారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన, దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్ లతో కలిసి సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సుకుమార్-బన్నీ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రమిది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. పుష్పరాజ్ పాత్రలో బన్నీ అదరగొట్టాడు. తెరపై ఎక్కడా కూడా బన్నీ కనిపించలేదు. పుష్పరాజ్ మాత్రమే కనిపించారు. అందుకే ఆయన నటనకు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.. బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్నీ ఇండస్ట్రీల ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

బన్నీకి రష్మిక మందన నటించింది. ఐటమ్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ సమంత మెరిసింది. విలన్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ ఫాజిల్ అదరగొట్టారు. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన పుష్ప విడుదలైన అన్ని చోట్ల అదరగొడుతోంది. బాలీవుడ్ లో భారీ కలెక్షన్స్ రాబడుతోంది.

Massive Blockbuster #PushpaTheRise Directors Party Snips..@alluarjun @aryasukku @MythriOfficial #AlluArjun #Sukumar #DirectorHARI #PushpaTheRiseInTheatres #PushpaTheRule #PushpaRaj #PushpaSuccessMeet #PushpaMASSiveSuccessParty #RashmikaMandanna #Sunil #anasuyabharadwaj #anasuya pic.twitter.com/qPlcnqbNtt— OTTRelease (@ott_release) December 28, 2021