గోరటి వెంకన్నకు అవార్డు

కవి, రచయిత, తెరాస ఎమ్మెల్సీ గోరటి వెంకన్నను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రాసిన ‘వల్లంకి తాళం’ కవితా సంపుటికి గానూ 2020-21 ఏడాదికి సంబంధించి కేంద్ర సాహిత్య అకాడమీ ఈ పురస్కారం ప్రకటించింది. ఆయనతో పాటు తూగుళ్ల గోపాల్‌ను కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం, దేవరాజు మహారాజును బాలసాహిత్య అవార్డు వరించింది.

నాగర్‌కర్నూల్‌ జిల్లా గౌరారంలో 1963లో జన్మించిన గోరటి వెంకన్న.. ‘వల్లంకి తాళం’తో పాటు అచ్చమైన పల్లెపదాలతో ఏకునాదం మోత, రేలపూతలు, అల సెంద్రవంక, పూసిన పున్నమి తదితర పుస్తకాలు రచించారు.