రెండో టెస్ట్ : టీమిండియా 202 ఆలౌట్

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 63.1 ఓవర్లలో టీమ్‌ఇండియా 202 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్‌ కేఎల్ రాహుల్ (50: 133 బంతుల్లో 9×4) అర్ధ శతకంతో రాణించాడు. సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (46: 50 బంతుల్లో 6×4) అర్ధ శతకం చేజారినా.. కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్ (26), హనుమ విహారి (20), రిషభ్‌ పంత్‌ (17), మహమ్మద్‌ షమి (9), ఛెతేశ్వర్‌ పుజారా (3), మహమ్మద్ సిరాజ్‌ (1) పరుగులు చేశారు. అజింక్య రహానె (0), శార్దూల్ ఠాకూర్ (0) డకౌట్‌ అయ్యారు. జస్ప్రీత్‌ బుమ్రా (14) నాటౌట్‌గా నిలిచాడు.

ఇక సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సన్‌ నాలుగు, ఒలివర్‌ మూడు, కగిసో రబాడ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సౌతాఫ్రికా 11.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 28 పరుగులతో ఆటను కొనసాగిస్తున్నది.