తెలంగాణలో స్కూల్స్ బంద్

తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, ఒమిక్రాన్‌ కేసుల పెరుగుదల నేపథ్యంలో అన్ని విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ నెల 8 నుంచి 16 వరకు సెలవులు ఇవ్వాలని సూచించారు.

మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ మరోసారి సీరో సర్వే చేయనున్నారు. ఐసీఎంఆర్‌, ఎన్‌ఐఎన్‌, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించనున్నారు. రక్తంలో యాంటీబాడీల అభివృద్ధిపై అధ్యయనం కోసం ఈ నెల 4 నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రతి జిల్లాలోని 10 గ్రామాల చొప్పున ఎంపిక చేసి సర్వే చేస్తారు. 16వేల మంది నమూనాలతో అధ్యయనం చేస్తారు.