నడ్డా క్యాండిల్ ర్యాలీకి గ్రీన్ సిగ్నల్

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీ.వో 317 కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14రోజుల రిమాండ్ ని విధించిన సంగతి తెలిసిందే. ఐతే కెసీఆర్ సర్కారు తీరుపై బీజేపీ అధిష్టానం తీవ్రంగా స్పందించింది.

బండి సంజయ్‌ని అరెస్టు చేసిన తీరు దారుణంగా ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. అంతేకాదు.. ఆయన హుటాహుటిన తెలంగాణ వచ్చేశారు. జైల్ లో ఉన్న సంజయ్ ని పరామర్శించమనున్నారు. ఈ క్రమంలో క్యాండిల్ ర్యాలీకి బీజేపీ పిలుపునిచ్చింది. అయితే నడ్డా క్యాండిల్ ర్యాలీని ఎలాంటి అనుమతులు లేవని చెప్పిన పోలీసులు.. తాజాగా ర్యాలీకి అనుమతి ఇచ్చినట్టు సమాచారం. కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జేపీ నడ్డాతో పోలీసు ఉన్నతాధికారులు చర్చించారు. ఆ తర్వాత అనుమతులు ఇచ్చినట్టు తెలుస్తోంది.