రాధేశ్యామ్ ఓటీటీ రిలీజ్.. 400 కోట్లు ఆపర్లు ?

సంక్రాంతి సినిమాలకు కరోనా సెగ తగిలింది. పండగ బరిలో ఉన్న పాన్ ఇండియా సినిమా ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే వాయిదా పడిన సంగతి తెలిసిందే. మరో పాన్ ఇండియా సినిమా ‘రాధేశ్యామ్’ కూడా అదే దారిలో వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. కానీ ప్రభాస్ టీమ్ ప్లాన్-బి గురించి ఆలోచిస్తుందట. సినిమా విడుదల వాయిదా వేయకుండా.. ఒకేసారి థియేటర్స్, ఓటీటీలో రిలీజ్ చేసే ఆలోచనలు చేస్తుందట. ప్రస్తుతం డిస్కషన్స్ జరుగుతున్నట్టు టాక్. 

మరోవైపు రాధేశ్యామ్ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కోసం ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్ ఇచ్చిందట. ఏకంగా రూ. 400కోట్ల ఆఫర్ చేసిందట. ఆ ఆఫర్ మంచిదే. కానీ చిత్ర యూనిట్ ఎటూ తేల్చుకోలేకపోతుందని తెలుస్తున్నది. థియేటర్స్ లో చూడాల్సిన సినిమా. విజువల్స్ వండర్ గా ఉంటుంది. అలాంటి సినిమాని ఓటీటీకి ఇవ్వడానికి మనసు ఒప్పడం లేదని చిత్ర యూనిట్ లోని ఓ కీలక వ్యక్తి అభిప్రాయపడినట్టు తెలుస్తున్నది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీ రిలీజ్ చేయడమే మంచిదని భావిస్తున్నట్టు సమాచారమ్.