TSలో 2వేలు దాటిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా మళ్లీ కోరలు చాస్తుంది. గత మూడు రోజులుగా కొవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో కొవిడ్ కేసులు 2వేల మార్క్‌ దాటాయి. గడిచిన 24 గంటల్లో  2,295 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,89,751కి చేరింది.

గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 4,039కి చేరింది. కరోనా నుంచి నిన్న 278 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9,861 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజు వ్యవధిలో నమోదైన మొత్తం కేసుల్లో 1,452 కేసులు ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి.