మహేష్ నువ్ త్వరగా కోలుకోవాలి

సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం అసోలేషన్ లో ఉన్నానని మహేష్ గురువారం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి టాలీవుడ్ తల్లిడిల్లిపోతుంది. మహేష్ త్వరగా కోలుకోవాలని ప్రేక్షకులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. ‘అన్నా.. త్వరగా కోలుకోవాలి.. ‘ అంటూ తారక్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి మహేష్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

“మహేష్ త్వరగా కోలుకోవాలి, మళ్ళీ నిన్ను నేను యాక్షన్ మోడ్ లో చూడాలి. అలా చూడడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను” అంటూ మెగాస్టార్ మెసేజ్ పెట్టారు. మహేష్ బాబు చాలా జాగ్రత్తగా ఉంటాడు. బయటకు పోవడానికి కూడా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాడు. ఆలాంటి మహేష్ కరోనా బారిన పడ్డాడు అనగానే అందరూ షాక్ అయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు దేవున్ని ప్రార్థిస్తున్నారు.