థమన్ కు కరోనా

టాలీవుడ్ ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికే మహేష్ బాబు కరోనా సోకింది. ఆయన కంటే ముందు మంచు లక్ష్మీ, మంచు మనోజ్ లకు పాజిటివ్ వచ్చింది.

హీరో నితిన్ భార్య కరోనాతో హోం అసోలేషన్ లో ఉన్నారు. తాజాగా సంగీత దర్శకుడు ఎస్.ఎస్ థమన్ కి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే చిన్నపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఆయన హోం అసోలేషన్ లో ఉన్నట్టు తెలుస్తున్నది. 

ప్రస్తుతం మహేష్ ‘సర్కారు వారి పాట’కు మ్యూజిక్ అందించే పనిలో థమన్ బిజీగా ఉన్నారు. త్వరలోనే అప్ డేట్ ఉంటుందని నిన్ననే ట్వీట్ చేసారు. దర్శకుడు పరశురామ్ తో కలిసి దిగిన ఓ పిక్ ని కూడా చేశారు. మహేష్ కు కరోనా అని తెలిసి.. ఆయన త్వరగా కోలుకోవాలని థమన్ ట్వీట్ చేశారు. ఇంతలోనే ఆయన కూడా కరోనా బారినపడ్డారు.