క్రాక్ నటికి కరోనా.. పరిస్థితి సీరియస్ ?

విలన్ గా టర్న్ తీసుకున్న హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్. తమిళ్, తెలుగు, కన్నడ బాషల్లో నటిస్తూ.. బిజీగా గడుపుతున్నది. ‘తెనాలి రామకృష్ణుడు ఎల్ఎల్ బి’తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత ‘క్రాక్’లో జయమ్మగా తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయింది. ‘నాంది’లో లాయరమ్మగా న్యాయం చేసింది. ఇప్పుడు బాలయ్య సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో #NBK107 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం వరలక్ష్మీని తీసుకున్నారు.

తాజాగా వరలక్ష్మీకి సంబంధించి షాకింగ్ న్యూస్ వచ్చింది. ఆమె కరోనా బారినపడ్డారు. గత రెండు రోజుల నుంచి తీవ్ర అస్వస్థతకు గురైన వరలక్ష్మి శరత్‌ కుమార్‌..గురువారం రాత్రి కరోనా పరీక్షలు చేయించుకున్నారు అయితే.. ఈ పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్‌ గా నిర్థారణ అయింది. అయితే.. ఆమె ఊపిరి తీసుకోవడం కాస్త ఇబ్బందిగా మారడంతో… హైదరాబాద్‌ లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ను చేర్పించారు ఆమె కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఆమె పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉందని తెలుస్తుంది. 

కరోనా థర్డ్ వేవ్ లో పలువురు బాలీవుడ్ ప్రముఖులు కరోనా బారినపడ్డారు. ఇప్పుడు సౌత్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే మహేష్ బాబుకి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయిది. వర్లలక్ష్మీ హాస్పటల్ లో చికిత్స పొందుతుంది. ఈ నేపథ్యంలో మరోసారి సినిమా షూటింగ్ లకు కంప్లీట్ గా బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.