శింబు ప్రేమలో నిధి.. రెండేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా కాపురం !

ప్రేమ వ్యవహారాలు కోలీవుడ్ స్టార్ శింబుకి కొత్తేమీ కాదు. మొదట నయనతారతో ఆ తర్వాత హన్సిక తో ప్రేమాయణం నడిపాడు. శింబు ఎంత ఈజీగా ప్రేమిస్తాడో.. అంతే ఈజీగా వదిలిస్తాడనే టాక్ ఉంది. ఇప్పుడు ఆయన ప్రేమలో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ పడిందట.

ఈశ్వరన్ సినిమాలో శింబు, నిధి అగర్వాల్ కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరికి పరిచయం ఏర్పడినట్టు సమాచారం. అనంతరం ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారినట్టు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అంతేకాదు.. గత రెండు సంవత్సరాలుగా ఒకే ఇంట్లో ఉంటూ డేటింగ్ చేసుకుంటున్నట్లు టాక్. త్వరలోనే వీరిద్దరూ కుటుంబ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

‘మానాడు’తో మళ్లీ హిట్ ట్రాక్ లో వచ్చేశాడు శింబు. టైమ్ లూప్ బేస్‌డ్ థ్రిల్లర్‌గా వచ్చిన మానాడు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఓటీటీలోను దూసుకుపోతోంది.ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా.. కల్యాణి ప్రియదర్శన్, ఎస్ జే. సూర్య కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమానూ తెలుగుతో పాటు భారతీయ అన్ని బాషల్లో రిమేక్ రైట్స్ ని సురేష్ ప్రొడక్షన్స్ కొనుగోలు చేసింది.