సినిమా వాళ్లు బలిసి కొంటుకుంటున్నారు.. వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

ఏపీలో సినిమా టికెట్ వ్యవహారం నడుస్తుంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఏమాత్రం గిట్టుబాటు కాదని సినిమా వాళ్లు అంటున్నారు. కానీ బయటికొచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు. నిలదీయడం లేదు. ఒకరిద్దరు.. వాళ్లు కూడా సౌమ్యంగానే అడుగుతున్నారు.

మరోవైపు సినిమా వాళ్లపై వైసీపీ నేతలు నోరు జారుతున్నారు. ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి టాలీవుడ్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారంటూ ..అసలు సినిమా వారికి ఏపీ అంటే గుర్తుందా ? అని ప్రశ్నించారు. టిక్కెట్ రేట్లు తగ్గిస్తే సామాన్యులు కూడా సినిమాలు చూస్తారని, ప్రభుత్వ నిర్ణయంలో తప్పేంటని ఆయన సమర్ధించుకున్నారు. సోమవారం కోవూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు ప్రసన్న కుమార్.. ఈ వ్యాఖ్యలు చేశారు.