ఇంకా ఐసీయూలోనే లతా మంగేష్కర్‌

ప్రముఖు గాయని, భారతరత్న లతా మంగేష్కర్‌ వారం రోజుల కిందట కరోనాతో ముంబైలోని బ్రీచ్‌ కాండీ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆమెకు స్వల్ప లక్షణాలే ఉన్నా.. ఆమె వయసు (92) దృష్ట్యా ఐసీయూ ఉంచి చికిత్స అందిస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలియజేశారు.

అయితే ఆమెకు ఇప్పుడు ఎలా ఉంది అంటే.. ? సీరియస్ ఏమీ లేదు. కానీ..   అప్పటి నుంచి లతా మంగేష్కర్‌ కు.. ఐసీయూలోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాతే ఐసీయూ నుంచి హాస్పటల్ నుంచి ఆమెని ఇంటికి తీసుకు రావాలని భావిస్తున్నారు.