4 కోట్ల రూపాయల 55 ఏళ్ల విస్కీ బాటిల్

ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్ లో ఒక వ్యక్తి రూ.4 కోట్లు పోసి మద్యం ఫుల్ బాటిల్ కొన్నాడు. చాలా మంది రాయితీ ధరలకు మద్యం దొరుకుతుంది అనే కారణంతో విమానాశ్రయాల్లో మద్యం కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే అనూహ్యంగా ఇస్తాంబుల్ విమానాశ్రయంలో చైనాకు చెందిన వ్యక్తి 4 కోట్ల రూపాయలకు అరుదైన జపనీస్ విస్కీని కొనుగోలు చేసాడు.

ఇది చాలా అరుదైన విస్కీ బాటిల్. దాని పేరు యమజాకీ. 55 ఏళ్ళ క్రితం తయారైన ఈ మద్యాన్ని వేలంలో పెట్టగా… దీన్ని సొంతం చేసుకోవడానికి దాదాపు 8 మంది పోటీ పడ్డారు. ఈ పోటీలో చైనాకు చెందిన వ్యక్తి ఆ మద్యం కోసం ఏకంగా 4 లక్షల 88 వేల పౌండ్ల రూపాయలను ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చాడు. మన కరెన్సీలో దాని ధర 4 కోట్లకు పై మాటే. కోట్లు పెట్టిన ఫుల్ బాటిల్ ఫుల్లుగా కిక్కుస్తుందని చెబుతున్నారు.