RC15 : సెట్స్ మీదకు వెళ్లక ముందే 200కోట్ల బిజినెస్

గ్రేట్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ చేస్తున్న సినిమా ఇదే. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో సునీల్, అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర కనిపించనున్నారు. 2023 సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంగీత సంచలనం, థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఈ సినిమా సెట్స్ మీదకు రామ్ చరణ్ ఇంకా అడుగుపెట్టలేదు. అప్పుడే ఈ సినిమా వందల కోట్ల బిజినెస్ చేస్తుంది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ మీడియా సంస్థ ZEE ఛానెల్ దాదాపు రూ. 200 కోట్ల రూపాయల కి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు స్ట్రీమింగ్ భాగస్వామిగా ZEE5 ఓటీటీతో డీల్ కుదర్చుకుందట. పెట్టుబడి పైసా పెట్టకుండా.. ప్రీ రిలీజ్ బిజినెస్ తో సినిమా షూటింగ్ కానిచ్చేలా ఉన్నాడు దిల్ రాజు.