కూల్ & కామ్ గా విడిపోయారు

ధనుష్-ఐశ్వర్యా రజనీ కాంత్ విడిపోయారు. విడాకులు తీసుకున్నారు. సాధారణంగా సెలబ్రెట్రీల బ్రేకప్ విషయంలో సోష‌ల్ మీడియాలో గాసిప్పుల ప‌రంప‌ర కొన‌సాగుతుంది. మెల్ల‌గా ఈ విష‌యాన్ని స్టార్లు ప్ర‌క‌టిస్తారు. స‌మంత – నాగ‌చైత‌న్య విష‌యంలో ఇదే జ‌రిగింది. దాదాపు మూడు నెల‌ల పాటు సోష‌ల్ మీడియాలో విడాకుల పై పెద్ద చ‌ర్చే జ‌రిగింది. ఆ త‌ర‌వాత‌.. ఇద్ద‌రూ త‌మ నిర్ణ‌యాన్ని ఒకేసారి ప్ర‌క‌టించారు. కానీ ధనుష్-ఐశ్వర్యల మధ్య విబేధాలు ఎక్కడా పొక్కలేదు. మంగళవారం అర్థరాత్రి ధనుష్ సడెన్ షాక్ ఇచ్చారు. భార్యతో విడిపోతున్నట్టు ప్రకటన చేసారు. ఉమ్మడి ప్రకటనను వేర్వేరుగా షేర్ చేశారు.  

“స్నేహితులుగా, దంపతులుగా, తల్లిదండ్రులుగా, పరస్పర శ్రేయోభిలాషులుగా 18 ఏళ్లు కలిసి బతికాం. పురోగతి, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడం, పరిస్థితులకు అలవాటుపడటం.. ఇలా సాగిందీ ప్రయాణం. ఈ రోజు ఇరువురివి భిన్నమార్గాలుగా కనపడుతున్నాయి. దంపతులుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మంచి భవిష్యత్తు కోసం, మమ్మల్ని మేము అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నాం. మా నిర్ణయాన్ని గౌరవించాల్సిందిగా విజ్ఞప్తి. ఈ పరిస్థితులను అధిగమించడానికి మాకు తగిన ప్రైవసీ ఇవ్వండి. మీ అందరికీ ఎప్పటిలాగే ప్రేమతో”  అంటూ వారు ట్వీట్ చేశారు. ఈ జంట‌కు యాత్రా రాజా (15 ఏళ్లు), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు.