ఫీవర్‌ సర్వేలో షాకింగ్ నిజాలు

తెలంగాణలో ఇంటింటి ఫీవర్‌ సర్వే కొనసాగుతోంది. ఈ సర్వేలో కొన్ని షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నట్టు సమాచారమ్. ఇప్పటివరకు 45,567 మందికి కరోనా లక్షణాలున్నట్టు గుర్తించారు. లక్షణాలున్న ప్రతిఒక్కరికీ హోం ఐసొలేషన్ కిట్స్‌ను అందజేశారు.

ఈ సర్వేలో చిన్నారులు, పెద్దవారి వివరాలు విడివిడిగా సేకరిస్తున్నారు. అయితే ఎక్కువ శాతం పెద్దవారిలోనే కరోనా లక్షణాలున్నట్లు గుర్తించారు. తీవ్ర కరోనా లక్షణాలుంటే వైద్య సిబ్బంది ఆస్పత్రిలో అడ్మిట్‌ చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో థర్డ్ వేవ్ విజృంభిస్తోంది. వచ్చే నెలలో కేసులు మరింతగా పెరగవచ్చని ఆరోగ్యశాఖ హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో ఇంటింటికి ఫీవర్ సర్వే చేయిస్తుంది సర్కారు.