మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. 7గురు మృతి !

 మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్థరాత్రి వార్థా జిల్లాలో వంతెన పైనుంచి కారు కింద పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వైద్య విద్యార్థులు దుర్మరణం చెందారు. మృతి చెందిన వారిలో గోండ్యా జిల్లా తిరోడా ఎమ్మెల్యే విజయ్‌ కుమారుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి వంతెన పైనుంచి కిందపడినట్లు స్థానికులు తెలిపారు. మృతులంతా సావంగిలోని మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ చదువుతున్నట్లు గుర్తించారు.