ధోని గురించి రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సింగిల్ పీస్. అలాంటి ఆటగాడు మళ్లీ రాడు, లేడు అని చెబుతుంటారు. ధోని ఎంత స్పెషల్ లో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి చెప్పారు. తాజాగా పాక్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ యూట్యూబ్‌ ఛానెల్లో మాట్లాడిన శాస్త్రి పలు ఆసక్తికర అంశాలను వెల్లడించాడు.

‘మహీ డకౌటైనా.. శతకం సాధించినా.. ప్రపంచకప్‌ గెలిచినా.. తొలి రౌండ్‌లోనే జట్టు వెనుదిరిగినా ఒకేలా ఉంటాడు. నేనెంతో మందిని చూశాను. కానీ, ధోనీ లాంటి ఆటగాడిని చూడలేదు. ఒక్కోసారి సచిన్‌కు కూడా టెంపర్మెంట్‌ ఉంటుంది. అప్పుడప్పుడు కోపం వస్తుంది. కానీ, ధోనీకి మాత్రం ఎప్పుడూ రాదు’ అని శాస్త్రి వివరించాడు.