వినాయక్.. తగ్గేదేలే

దర్శకులు నటులుగా బిజీ అయిన వారు ఉన్నారు. సముద్రఖనీ, పోసాని కృష్ణమురళీ మంచి దర్శకులు. ఇప్పుడు నటనలో రాణిస్తున్నారు. ఈ జాబితాలో మాస్ దర్శకుడు వి.వి వినాయక్ చేరుతా అంటున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో ‘శీనన్న’ సినిమా స్టార్ట్ అయింది.. క్యాన్సిల్ అయింది. అయినా నటన విషయంలో తగ్గేదేలే.. మరో ప్రాజెక్టుతో త్వరలోనే తెరపైకొస్తానంటున్నాడు వినాయక్.

15 నిమిషాల కథగా చెప్పినప్పుడు శీనయ్య బాగుంది. కానీ దాన్ని రెండున్నర గంటల సినిమాగా మార్చినప్పుడు ఎవ్వరికీ నచ్చలేదు. దీంతో ఆ ప్రాజెక్టును ఆపేశాం. భవిష్యత్తులో శీనయ్య వచ్చే అవకాశం లేదు. కానీ మరో రూపంలో నేను తెరపైకొస్తాను. మంచి ప్రాజెక్టు దొరికితే నటించడానికి సిద్ధం అని వినాయక్ ప్రకటించారు. మరోవైపు దర్శకత్వం వహిస్తా. ప్రస్తుతం ఓ కథపై కూర్చున్న. స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత ఎవరితో ఉంటుంది ? అన్నది చెబుతా అన్నారు.