ప్రభాస్-సూర్య, చిరు-వెంకీ.. ఫైట్ !

దేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది. తిరిగి సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు ఎత్తేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమలో ఆశలు చిగురించాయి. వాయిదా పడిన సినిమాల కొత్త రిలీజ్ డేట్స్ ఫిక్సయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాని మార్చ్ 25న రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇక మరో పాన్ ఇండియా ఇండియా సినిమా రాధేశ్యామ్ మార్చ్ 10న రిలీజ్ కాబోతుంది.

ఒక్క తెలుగులో మాత్రమే కాదు.. తమిళ్, మలయాళం.. హిందీ ఇలా అన్ని ఇండస్ట్రీలో సినిమాలు కొత్త రిలీజ్ డేట్స్ ని లాక్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో పోటీ తప్పడం లేదు. ఒకే డేటుకి రెండు అంతకుమించి సినిమాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చ్ 10న రాధేశ్యామ్ తో పాటు కోలీవుడ్ స్టార్ సూర్య  #EtharkkumThunindhavan రిలీజ్ కానుంది. సూర్యకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. ఈ నేపథ్యంలో పోటీ రసవత్తరంగా ఉండనుంది.

ఇక ఏప్రిల్ 28న ఎఫ్ 3 రిలీజ్ కానుండగా.. ఆ మరుసటి రోజే అంటే ఏప్రిల్ 29న ఆచార్య రిలీజ్ కానుంది. ఏప్రిల్ 14న కూడా ఇలాంటి పోటీనే నెలకొంది. అదే రోజు విజయ్ బీస్ట్, యశ్ కేజీఎఫ్ 2 సినిమాలు రిలీజ్ కానున్నాయి. మొత్తానికి.. వరుసగా పెద్ద సినిమాల రిలీజ్ తో.. బాక్సాఫీస్ ఫైట్ సమ్మర్ వరకు రసవత్తరంగా సాగనుంది.