‘లైగర్’ లాస్ట్ షెడ్యూల్ షురు

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘లైగర్’. అనన్య పాండే హీరోయిన్. ఈ సినిమాను ఛార్మీ, పూరీతో పాటు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. హాలీవుడ్ రేంజ్‌లో రాబోతుంది బాక్సింగ్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోన్న ‘లైగర్’లో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా నటిస్తున్నాడు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు లైగర్ కోసం పని చేశారు.  అమెరికన్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తయింది.

ఇప్పుడు లైగర్ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈరోజు నుంచి ఆఖరి షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని నిర్మాతల్లో ఒకరైన ఛార్మి ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. కొన్ని సెట్స్ పిక్స్ ని షేర్ చేసింది. ఆగస్ట్ 15న లైగర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నరు. ఇక లైగర్ తర్వాత పూరి-విజయ్-కరణ్ జోహార్ కాంబోలో మరో సినిమా ఉండనుందని తెలుస్తోంది. లైగర్ రిలీజైన వెంటనే ఈ సినిమాని అధికారికంగా ప్రకటించనున్నారు.