మే 27న ‘మేజర్’ విడుదల

ప్రాణం పెట్టి సినిమా చేసే నటుడు అడవి శేష్. క్షణం, గూడాచారి, ఎవరు సినిమాలతో విజయాలు అందుకున్నాడు. ఆయన  లెటెస్ట్ సినిమా మేజర్. ముంబై 26/11 దాడుల్లో వీరమరణం పొందిన ఎన్‌ఎస్‌జీ కమాండో సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కింది. సందీప్‌ ఉన్నికృష్ణన్‌ పాత్రలో అడవి శేష్ ఒదిగిపోయారు. టీజర్ లోనే ఆయన డెడికేషన్ కనిపించింది. పాన్ ఇండియా సినిమా రాబోతున్న మేజర్ రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్రబృందం. మే 27న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్లతో పాటు స‌యీ మంజ్రేక‌ర్ కూడా మరో కథానాయికగా నటిస్తుంది. ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్‌ హోమ్ బేనర్‌ జీఎంబీ ప్రొడక్షన్స్‌ సోనీ పిక్చర్స్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, మలయాళంలో కూడా రిలీజ్ చేయనున్నారు.