పుట్టుమ‌చ్చ‌ల ప్ర‌శ్న‌.. పీఆర్వో టీమ్ కీలక నిర్ణయం

ఇటీవ‌ల ‘డీజే టిల్లు’ ప్రెస్ మీట్లో సురేష్ కొండేటి అడిగిన ప్ర‌శ్న‌.. వివాదాస్ప‌ద‌మైంది. మీడియా ముఖంగా “సినిమాలో హీరోయిన్ చేత 16 పుట్టుమచ్చలున్నాయని చెప్పించారు కదా, మరి రియల్ గా ఆ హీరోయిన్ కు ఒంటిపై ఎన్ని పుట్టుమచ్చలున్నాయో తెలుసుకున్నారా?“ అంటూ అభ్యంత‌ర‌క‌ర‌మైన ప్ర‌శ్న వేయ‌డంతో.. స్టేజీపై వాళ్లంతా స్ట‌న్ అయ్యారు. హీరో ఈ ప్ర‌శ్న‌ని అవాయిడ్ చేస్తూ త‌ప్పుకున్నా, సోష‌ల్ మీడియాలో ఈ ఉదంతంపై చాలా పెద్ద చ‌ర్చ న‌డిచింది.

సురేష్ కొండేటిని దారుణంగా ట్రోల్ చేశారు. స‌ద‌రు హీరోయిన్ సోష‌ల్ మీడియాలో త‌న బాధ‌ని పంచుకుంది. హీరో కూడా ఓ ట్వీట్ చేశాడు. చివ‌రికి సురేష్ కొండేటి సారీ చెప్ప‌డంతో… ఈ వ్యవ‌హారం కాస్త స‌ద్దుమ‌ణిగింది. ఈ ప్ర‌శ్న‌తో.. టాలీవుడ్ పీఆర్వో బృందం మేలుకుంది. ఇక మీద‌ట ప్రెస్ మీట్లో.. ప్ర‌శ్న‌లు అడుగుతున్న‌ప్పుడు వాళ్ల‌పై కెమెరా పెట్ట‌కూడ‌ద‌ని, సంచ‌ల‌నం కోసం ఏమైనా అడిగేసే వాళ్ల‌కు అస‌లు మైక్ ఇవ్వ‌కూడ‌ద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చింది.