ఆచార్య బాలీవుడ్ రిలీజ్

మెగా అభిమానులకు గుడ్ న్యూస్. టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లోనూ మెగా హీరోల హవా కొనసాగనుంది. ఇప్పటికే ‘పుష్ప’ సినిమాతో మెగా హీరోల పవర్ ఏంటో బాలీవుడ్ అభిమానులకు రుచి చూపించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా బాలీవుడ్ కు వెళ్తున్నారు. ఆయన లెటెస్ట్ సినిమా భీమ్లా నాయక్ హిందీలోనూ రిలీజ్ కాబోతుంది. ఈ నెల 25న తెలుగు తో పాటు హిందీలోనూ భీమ్లా నాయక్ ఉంటుంది. 

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ కూడా హిందీలో రిలీజ్ కాబోతున్నది. ఏప్రిల్ 29న తెలుగు, హిందీలోనూ ఒకేసారి ఆచార్య విడుదల ఉండనుంది. అవినీతి పరులైన భూస్వాముల పెత్తందారీతననానికి వ్యతిరేకంగా పోరాడే నక్సలైట్ల పాత్రల్లో చిరంజీవి – చరణ్ కనిపించనున్నారు.

చిరూ సరసన కాజల్ అలరించనుండగా, చరణ్ జోడీగా పూజ హెగ్డే సందడి చేయనుంది. నిరంజన్ రెడ్డితో కలిసి చరణ్ నిర్మించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు.