మోహన్ బాబు ఫ్యామిలీ కి ఘోర అవమానం

డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఫ్యామిలీకి సోషల్ మీడియా వేదికగా ఘోర అవమానం జరుగుతుంది. విపరీతమైన ట్రోలింగ్, మీమ్స్ చేస్తున్నారు. మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన సన్ ఆఫ్ ఇండియా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా టికెట్స్ ఇప్పటి వరకు తెగడం లేదు. బుక్ మై షో లో ఎవరు బుక్ చేసుకోవడం లేదు. ప్రధాన నగరాల్లో ఒకటి, అర మాత్రమే అమ్ముడుపోయాయి. దీంతో.. వెయ్యి లోపే ప్రీ రిలీజ్ కలెక్షన్స్ వచ్చాయి. దీనిపై సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతున్నది.

సన్నాఫ్ ఇండియా యాష్ ట్యాగ్ ట్రెండింగ్ టాప్ లో కొనసాగుతున్నది. మంచు ఫ్యామిలీలో దర్శకులు వారే, నటులు వారే, నిర్మాతలు వారే, ఆఖరికి ప్రేక్షకులు కూడా వారేనని సెటర్స్ వేస్తున్నారు. అయితే ట్రోలింగ్ పై మోహన్ బాబు స్పందించారు. సెలబ్రెటీలపై వస్తున్న ట్రోలింగ్, మీమ్స్ చూసి చాాలా బాధపడుతున్నానని.. నేను వీటిని సాధారణంగా పట్టించుకోనని.. అయితే కొంత మంది మాత్రం అదే పనిగా ఉంటారని అన్నారు. ఇద్దరు హీరోలు కొంతమందిని పెట్టుకుని ట్రోలింగ్ చేయిస్తున్నారంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒక రోజు వారికి శిక్ష తప్పదు అంటూ కామెంట్స్ చేశారు. మోహన్ బాబు వ్యాఖ్యలతో ఆ ఇద్దరు హీరోలు ఎవరా..? అని నెటిజెన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.