హిందీ ‘దృశ్యం 2’ ప్రారంభం

హిందీలోనూ ‘దృశ్యం 2’ సిద్ధమవుతోంది. అజయ్‌దేవ్‌గణ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ గురువారం ముంబయిలో మొదలైంది. టబు, శ్రియ, ఇషిత దత్తా తదితరులు నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ కోసం త్వరలో చిత్రబృందం గోవా వెళ్లనుంది.

ఈ విషయాన్ని అజయ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. దృశ్యం గొప్ప సినిమా. విజయ్‌ పాత్ర ద్వారా ‘దృశ్యం 2’లో మరో ఆసక్తికర కథ చెప్పబోతున్నాం. దర్శకుడు అభిషేక్‌ పాఠక్‌ ఈ కథపై సరికొత్త ఆలోచనలతో సిద్ధంగా ఉన్నారు. తొలి చిత్రాన్ని మించి ఉత్కంఠ ఈ సీక్వెల్‌లో ఉంటుంది” అని చెప్పారు అజయ్‌.