పవన్ కోసం రంగంలోకి కేటీఆర్

‘భీమ్లా నాయక్’ సినిమా ప్రమోషన్స్ కు పెద్దగా సమయం లేదు. గురువారమే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. వచ్చే శుక్రవారం (ఫిబ్రవరి 25) ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ కోసం కేవలం వారం రోజులు మాత్రమే ఉన్నాయి.

పవన్ సినిమాకు ఈ సమయం చాలు. కానీ చిత్ర యూనిట్ రిస్క్ తీసుకోవడం లేదు. మంత్రి కేటీఆర్ ను ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఆహ్వానించింది. స్వయంగా త్రివిక్రమ్ కేటీఆర్ ఆఫీస్ కు వెళ్లి ఆహ్వానించారు. ఆయన ఓకే అన్నారు. వెంటనే భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ కేటీఆర్ అంటూ పోస్టర్స్ వదిలారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పొలిటికల్ గా కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేసింది.

ఇక ఫంక్షన్ లో పవన్-కేటీఆర్ ఒకరినొకరు పొగడ్తలతో పీక్స్ చేరడం ఖాయం. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. కథ-స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ అందించారు.  రానా మరో కథానాయకుడు. పవన్ కి జంటగా నిత్యామీనన్ నటించింది. థమన్ సంగీతం అందించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, హారిక & అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి.