‘భీమ్లా నాయక్’ యూఎస్ లో కూడా అదిరిపోయింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాన్, రానా  హీరోలుగా , నిత్యా మీనన్ , సంయుక్త మీనన్ హీరోయిన్లు కలిసి నటిస్తున్న యాక్షన్ ఎంటటైనర్ చిత్రం ‘భీమ్లా నాయక్’.  సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.  కాగా   ఈ నెల 25న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్లలో కూడా భీమ్లా నాయక్ సెన్సేషన్ గట్టిగానే ఉంది.
ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ చెయ్యగా ఊహించని లెవెల్లో బుకింగ్స్ జరుగుతున్నాయి మరి లేటెస్ట్ గా అయితే యూఎస్ లో ప్రీమియర్స్ తోనే ఏకంగా 2 లక్షల డాలర్లు ఈ చిత్రం క్రాస్ చేసేసినట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ చిత్రం పై ఎలాంటి హైప్ నెలకొందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ట్రైలర్ వచ్చాక ఆ హైప్ ఇంకెంత ఉంటుందో చూడాల మరి .