భీమ్లా నాయక్ కు కేసీఆర్ సర్కార్ గిఫ్ట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం గిఫ్ట్ ఇచ్చింది. ఐదో షోకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన విడుదల అయింది. ఈ నెల 25 నుంచి మార్చి 11 వరకు రెండు వారాల పాటు ఐదో ఆటకు పర్మీషన్ ఇచ్చింది. దీంతో తెలంగాణ థియేటర్స్ లో ఉదయం 8 గంటల నుంచి భీమ్లా నాయక్ సందడి చేయనున్నారు.

ఇక మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా, మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పెషల్ గెస్ట్ గా హాజరుకానున్నారు. పవన్ – కేటీఆర్ లను ఒకే వేదికపై అభిమానులు చూడబోతున్నారు. పవన్ గురించి కేటీఆర్ ఏం మాట్లాడబోతున్నారు అన్నది ఆసక్తిగా మారింది.

సాగర్ కె చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ తెరకెక్కింది. మాటలు-స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ అందించారు. పవన్ కు జంటగా నిత్యా మీనన్ నటించింది. రానాకు జంటగా నివేదా థామస్ కనిపించనుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది.