భీమ్లా థాంక్స్ మీట్.. సప్పగా !

భారీ అంచనాల మధ్య శుక్రవారం విడుదలైన భీమ్లా నాయక్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. ఈ ఆనందంలో ఈరోజు భీమా చిత్ర బృందం థాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ మీట్‌లో దాదాపుగా చిత్ర‌బృందం అంతా పాల్గొంది. కానీ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రానాలు రాలేదు. స‌క్సెస్ మీట్ల‌కు పవన్ దూరంగా ఉంటాడు. ఆ విషయం అందరికీ తెలిసిందే. రానా కూడా రాకపోవడం లోటు అనిపించింది. త్రివిక్ర‌మ్ మాట్లాడారు. వేదిక‌పై ఏ ఒక్క‌రు కూడా వివాదాస్ప‌ద అంశాల‌కు వెళ్ల‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. 

మీడియాతో క్వ‌శ్చ‌న్ అండ్ ఆన్స‌ర్ సెష‌న్‌కి అవ‌కాశం క‌ల్పించ‌లేదు. తాము ఏం మాట్లాడాలో, అది మాట్లాడేసి వెళ్లిపోయారంతే. ఒక‌వేళ మీడియాతో ప్ర‌శ్న‌లు – జ‌వాబులూ పెట్టుకుంటే ఏపీలో టికెట్ రేట్ల వ్య‌వ‌హారంపై స్పందించాల్సి ఉంటుంది. అందుకే ఇలా జాగ్ర‌త్త ప‌డ్డారు. పవన్, రానా రాకపోవడం.. మీడియాకు ప్రశ్నలు అడగే అవకాశం ఇవ్వకపోవడంతో భీమ్లా థాంక్స్ మీట్ సప్పగా సాగినట్టు అనిపించింది. అయితే ఇది కేవ‌లం థ్యాంక్స్ మీట్ మాత్ర‌మే..  త్వ‌ర‌లో గ్రాండ్ గా స‌క్సెస్ మీట్ నిర్వ‌హిస్తామ‌ని చిత్ర యూనిట్ తెలిపింది.