రాధేశ్యామ్ కోసం రాజ‌మౌళి

ప్ర‌భాస్-పూజా హెగ్డే జంట‌గా న‌టించిన చిత్రం ‘రాధే శ్యామ్‌’. రాధాకృష్ణ ద‌ర్శ‌కుడు. మార్చి 11న ‘రాధేశ్యామ్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా హిందీ వెర్ష‌న్‌కి బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ తో వాయిస్ ఓవ‌ర్ ఇప్పించారు. తెలుగు వెర్ష‌న్‌కి మ‌హేష్ బాబు గొంతు ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఈ సినిమా క‌థ‌ని రాజ‌మౌళి ప‌రిచ‌యం చేయ‌బోతున్నారు. అవును… ‘రాధే శ్యామ్‌’కి రాజ‌మౌళి వాయిస్ ఓవ‌ర్ ఇచ్చారు.

 బాహుబలి తో ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ ని చేసిన దర్శకుడు  రాజ‌మౌళి. ప్ర‌భాస్ కోసం రాజ‌మౌళి, రాజ‌మౌళి కోసం ప్ర‌భాస్ ఏమైనా చేస్తారు. ఇప్పుడు రాధే శ్యామ్‌ తెలుగు వర్షన్ కోసం వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇక వచ్చే వారం రాధేశ్యామ్ కొత్త ట్రైలర్ రాబోతుంది. మార్చి 1 నుంచి పాన్ ఇండియా ప్రమోషన్స్ షురు కానున్నాయి. బాలీవుడ్ లో ఓ ఈవెంట్ ని ప్లాన్ చేస్తోంది చిత్ర‌బృందం. హైద‌రాబాద్ లోనూ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ చేస్తారు. ఈ రెండింటిలో ఒక చోట రాజ‌మౌళి హాజరు కాబోతున్నారు.