ముంబై వీధుల్లో చిల్

మిస్ వరల్డ్ కిరీటం తెచ్చిపెట్టిన ఆరో భారత అందం మానుషి చిల్లర్. 2017లో మిస్ వరల్డ్ విజేతగా నిలిచింది. అంతకుముందు రీటా ఫారియా (1996), ఐశ్వర్యా రాయ్ (1194), డయానా హేడెన్ (1197), యుక్తా ముఖే (1999), ప్రియాంక చోప్రా (2000) ఈ టైటిల్ ను గెలుచుకున్నారు.

ఇక ‘పృధ్వీరాజ్’ సినిమాతో మానుషి చిల్లర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇదో హిస్టారికల్ యాక్షన్ డ్రామా. పృధ్వీరాజ్ చౌహాన్ పాత్రలో అక్షయ్ కుమార్ నటించారు. ఆయనకి జంటగా సంయోగిత పాత్రలో మనూష్ చిల్లర్ నటించారు. సంజయ్ దత్, సోనూసూ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. జనవరి 21న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కరోనా ఎఫెక్ట్ తో జూన్ 3కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. చిల్లర్ నటిస్తున్న మరో సినిమా ‘ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’ కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది. రిలీజ్ కి రెడీగా ఉంది.

ప్రస్తుతం సినిమా షూటింగ్స్ లేకపోవడం చిల్లర్ మస్త్ చిల్ అవుతుంది. ముంబై వీధుల్లో విహరిస్తోంది. వైట్ డ్రెస్ లో కూల్ లుక్స్ లో ఉన్న ఆమె లెటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.