టాలీవుడ్ హీరోపై కేసు

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్, ఆయన కుమారుడు, యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై కేసుపై పోలీస్ కేసు నమోదైంది. సురేశ్‌, ఆయన కుమారుడు సాయి శ్రీనివాస్‌ 2018లో తన నుంచి రూ.85 లక్షలు తీసుకున్నారని.. ఎన్నిసార్లు అడిగినా తిరిగి ఇవ్వడం లేదంటూ బంజారాహిల్స్‌లో నివసించే శరణ్‌కుమార్‌ ఇటీవల కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం సురేశ్‌, సాయిశ్రీనివాస్‌లపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఈ వ్యవహారంపై సురేశ్‌ స్పందించారు. శరణ్‌కుమార్‌ది మా గ్రామమే. సినిమా టికెట్ల విషయమై అతడు తరచూ నాకు ఫోన్‌ చేసేవాడు. అక్కడ ఉన్న డిస్టిబ్యూటర్లతో మాట్లాడి అతడికి ప్రతి వారం టికెట్లు అందేలా చేశాను. అలాంటి వ్యక్తి ఈరోజు మాపై కేసు పెట్టాడు. అతడ మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రూ.85 లక్షలు ఇచ్చినట్లు ఏదైనా సాక్ష్యాలు ఉంటే చూపించమనండి. బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు తీసుకోవడం కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు.