స్మృతి, హర్మన్‌ సెంచరీలు.. టీమిండియా 317/8

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా బ్యాటర్లు స్మృతి మంధాన (123; 119 బంతుల్లో 13×4, 2×6), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (109; 107 బంతుల్లో 10×4, 2×6) శతకాలతో కదం తొక్కారు. స్మృతి, హర్మన్‌.. తొలుత నెమ్మదిగా ఆడారు. క్రీజులో కుదురుకున్న తర్వాత రెచ్చిపోయి పరుగులు చేశారు.

ఈ క్రమంలోనే ఇద్దరూ నాలుగో వికెట్‌కు 184 పరుగుల కీలక భాగస్వామ్యం జోడించారు. 50 ఓవర్లు పూర్తయ్యేసరికి 8 వికెట్ల నష్టానికి 317 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. విండీస్‌ బౌలర్లలో అనిసా మహ్మద్‌ రెండు వికెట్లు తీయగా కాన్నెల్‌, మాథ్యూస్‌, షకీరా, డాటిన్‌, ఆలియా తలో వికెట్‌ పడగొట్టారు.