రన్ వే 34 ట్రైలర్ టాక్

అజయ్ దేవగణ్ – రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న బాలీవుడ్ సినిమా ‘రన్ వే34. ఈ చిత్రానికి దర్శకుడు-నిర్మాత-హీరో కూడా అజయ్ దేవగణ్ నే. ఆయనకు జంటగా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించారు. ఏప్రిల్ 29న రన్ వే 34 ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ట్రైలర్ అదిరిపోయింది. కథ-కథనాలు ఉత్కంఠభరింతంగా సాగాయి. ఇదో డ్రామా థ్రిల్లర్. సినిమాలో అమితాబ్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని ట్రైలర్ ను చూస్తే అర్థమవుతోంది.