భీమ్లా నాయక్ OTT రిలీజ్.. ఒకరోజు ముందుగానే !

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. ముందుగా ప్రకటించిన డేట్ కంటే ఒకరోజు ముందుగానే ‘భీమ్లా నాయక్’ ఓటీటీలోకి రాబోతుంది. ఈ నెల 25 నుంచి పవన్ సినిమా ఓటీటీలో సందడి చేయాల్సి ఉంది. కానీ అభిమానుల నుంచి వస్తున్న విజ్ణప్తుల మేరకు ఓ రోజు ముందుగానే తీసుకొస్తున్నామని ఓటీటీ డిస్నే ప్లస్ హాట్ స్టార్ మరియు ఆహా ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. మాటలు-స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ అందించారు. థమన్ సంగీతం సమకూర్చారు. గత ఏడాది 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన భీమ్లా నాయక్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సరిగ్గా నెల రోజులకి ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారు. అయితే అభిమానుల డిమాండ్ మేరకు ఒకరోజు ముందు నుంచే ఓటీటీలో భీమ్లా సందడి చేయనున్నాడు.