మెగాస్టార్.. పొలిటికల్ పశ్చాతాపం

రాజకీయాల్లో వెళ్లినందుకు మరోసారి పశ్చాత్తాప పడ్డారు మెగాస్టార్ చిరంజీవి. తాప్సీ కీలక పాత్రలో దర్శకుడు స్వరూప్‌ ఆర్‌.ఎస్‌.జె. తెరకెక్కించిన చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్‌’ ఏప్రిల్‌ 1న విడుదలకానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న చిరు.. తాప్సీలాంటి కథానాయికలతో నటించలేకపోయినందుకు ఫీలవుతుంటుంటా. వారిని చూస్తుంటే రాజకీయాల్లోకి ఎందుకెళ్లానా అని అనిపిస్తుందని అన్నారు.

ఈ చిత్రంలో తాప్సీ పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. తన తొలి సినిమా ‘ఝుమ్మంది నాదం’ ఈవెంట్‌కు హాజరయ్యా. అప్పటికి, ఇప్పటికీ నటిగా ఆమెలో చాలా మార్పొచ్చింది. తాను నటించిన నాయికా ప్రాధాన్య చిత్రాలు చూసినప్పుడు ‘క్యూట్‌గా ఉండే తాప్సీనేనా ఇంత పవర్‌ఫుల్‌గా నటించింది’ అని సందేహం కలుగుతుంటుందన్నారు చిరు. ఈ సిమాలో ముగ్గురు బాల నటులు చాలా బాగా నటించారు. స్వరూప్‌ దర్శకత్వం బాగుంది. ఇది చిన్న సినిమా కాదు అందరినీ ఆకట్టుకునే పెద్ద సినిమా అన్నారు చిరు.