బెంగళూరు బోణీ

ఐపీఎల్-15 లో బెంగళూరు బోణీ కొట్టింది. కోల్‌కతా నిర్దేశించిన 129 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 19.2 ఓవర్లలోనే ఛేదించింది. బెంగళూరు బ్యాటర్లలో షాబాజ్‌ అహ్మద్‌ (27 : 20 బంతుల్లో 3×6), రూథర్‌ఫర్డ్‌ (28) కీలక ఇన్నింగ్సులు ఆడారు. కోల్‌కతా బౌలర్లలో టిమ్‌ సౌథీ మూడు, ఉమేశ్ యాదవ్ రెండు, సునీల్ నరైన్, వరుణ్‌ చక్రవర్తి తలో వికెట్ పడగొట్టారు.

అంతకుముందు కోల్‌కతా 18.5 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌటైంది. బెంగళూరు ముందు 129 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కోల్‌కతా బ్యాటర్లలో ఆండ్రూ రసెల్‌ (25) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆఖర్లో వచ్చిన ఉమేశ్ యాదవ్‌ (18) పరుగులు చేశాడు. ఓపెనర్లు అజింక్య రహానె (9),  వెంకటేశ్ అయ్యర్‌ (10), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ (13), నితీశ్ రాణా (10), సునీల్ నరైన్ (12), సామ్ బిల్లింగ్స్‌ (14), షెల్డన్ జాక్సన్‌ (0) డకౌట్ కాగా, టిమ్ సౌథీ ఒక పరుగు చేశాడు. వరుణ్‌ చక్రవర్తి (10) నాటౌట్‌గా నిలిచాడు.

బెంగళూరు బౌలర్లలో వనిందు హసరంగ నాలుగు, ఆకాశ్ దీప్‌ మూడు, హర్షల్ పటేల్‌ రెండు, మహమ్మద్‌ సిరాజ్‌ ఒక వికెట్ పడగొట్టారు.