RC15లో కీర్తి సురేష్

గ్రేట్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. చరణ్ కి జంటగా కియారా అద్వానీ నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర అప్ డేట్ ఒకటి వచ్చింది. ఇందులో కీర్తి సురేష్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం.

 సినిమాలో రామ్ చరణ్ డ్యుయల్ రోల్ లో కనిపించబోతున్నట్టు సమాచారం. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పాత్రలో రామ్ చరణ్ కి జంటగా కీర్తి సురేష్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో అంజలి, జయరామ్, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. దాదాపు రూ. 170కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.