ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్‌ శత జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నందమూరి ఫ్యామిలీ, అభిమానులు నివాళులుఅర్పించారు. మరికొందరు సినీ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా మహానుభావుడికి నివాళులు అర్పించారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరు కలిసి వచ్చి తాతకు నివాళులు అర్పించారు.

“మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా” అంటూ తారక్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

“ఇంతకు ముందు, ఇకపై ఆయనలా ఎవరూ లేరు. ఉండరు. వన్‌ అండ్‌ ఓన్లీ ఎన్టీఆర్‌” అంటూ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ట్వీట్ చేశారు.