దేశ సేవలో ఎన్నడూ రాజీ పడలేదు

ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సొంత రాష్ట్రం గుజరాత్‌ పర్యటించారు. రాజ్‌కోట్‌లో  శ్రీ పటేల్ సేవా సమాజ్ ట్రస్ట్ నిర్మించిన కేడీపీ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. దేశ సేవలో ఎన్నడూ రాజీ పడలేదని తెలిపారు. గుజరాత్‌ నేర్పిన పాఠాలే తనను ఇలా తీర్చిదిద్దాయని కృతజ్ఞత చాటారు. మహాత్ముడు, సర్దార్ పటేల్ ఆశయాలకు అనుగుణంగా దేశ నిర్మాణంలో ఈ ఎనిమిదేళ్లు నిజాయతీగా కృషి చేశాం. దేశ ప్రజలు సిగ్గుతో తలవంచుకునేలా చేసే ఏ పనిని అనుమతించలేదు అన్నారు.

జన్‌ధన్‌ యోజన ద్వారా పేద ప్రజలు ప్రయోజనం పొందారు. కొవిడ్ క్లిష్ట సమయంలో ప్రజలకు ఉచితంగా టీకాలు అందేలా చూసుకున్నాం. రైతులు, కార్మికుల జన్‌ధన్‌ ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేశాం. పేదలకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లను ఏర్పాటు చేశామని ప్రధాని చెప్పుకొచ్చరు.