చరణ్‌కు బియ్యం కానుక

ఒక్కొక్కరు ఒక్కో విధంగా అభిమానం చాటుకుంటారు. తాజాగా రామ్‌చరణ్‌ కోసం ఓ అభిమాని ఏకంగా 264 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. గద్వాల్‌కు చెందిన జైరాజ్‌ అనే యువకుడు తన అరెకరం వరి పొలంలో రామ్‌ చరణ్‌ ముఖచిత్రం ఆకారంలో వరి పంటను సాగు చేసి అందులో పండిన బియ్యాన్ని చరణ్‌కు కానుకగా ఇచ్చాడు. తన కానుకను అందించడం కోసం ఏకంగా 264 కిలోమీటర్లు నడుచుకుంటూ రామ్‌చరణ్‌ నివాసానికి చేరుకున్నాడు. అభిమానితో రామ్ చరణ్ దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం గ్రేట్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో చరణ్ కి జంటగా కైరా అద్వానీ నటిస్తోంది. శంకర్ మార్క్ సోషల్ మెసేజ్ తో ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమా అప్ డేట్ రానుంది. టైటిల్ తో పాటు రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ను ప్రజెంట్ చేయబోతున్నారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత చరణ్ నటిస్తున్న రెండో పాన్ ఇండియా సినిమా ఇది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మాత.