కరోనా ఇంకా పోలే.. కొత్తగా 2,706 కేసులు

కరోనా పూర్తిగా పోలేదు. కాకపోతే అదుపులోనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,706 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 2,070 మంది కోలుకున్నారు. 25 మంది మరణించారు. ఇప్పటివరకూ 4.31 కోట్ల మందికి కరోనా సోకగా.. అందులో 98.74 శాతం మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. 5,24,611 మంది మృత్యుఒడికి చేరుకున్నారు.

ఇక క్రియాశీల కేసులు 17,698(0.04 శాతం)కి చేరాయి. నిన్న సెలవు రోజు కావడంతో కేవలం 2.28 లక్షల మంది మాత్రమే టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకూ పంపిణీ అయిన డోసులు సంఖ్య 193 కోట్లు దాటాయని సోమవారం కేంద్రం వెల్లడించింది.