మేజర్.. ఇండియన్ సినిమాలోనే తొలిసారి !

ముంబయి ఉగ్ర దాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. శశికిరణ్‌ తిక్కా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శేష్‌ మేజర్‌గా కనిపించనున్నారు. ప్రకాశ్‌రాజ్‌, శోభిత, సయీ మంజ్రేకర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మహేశ్‌బాబు సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా జూన్‌ 3న విడుదలకానుంది.

ఈ సందర్భంగా చిత్ర బృందం వైజాగ్‌లోని సంగం శరత్‌ థియేటర్‌లో ప్రత్యేక షోను ప్రదర్శించి, ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా హీరో అడవిశేష్‌ మాట్లాడుతూ.. “విడుదలకు కొన్ని రోజుల ముందే ‘మేజర్‌’ సినిమాను ప్రేక్షకులకు చూపించి, వారి మధ్యే ముందస్తు విడుదల కార్యక్రమం నిర్వహించటం సంతోషంగా ఉందని, ఇలా చేయటం భారతీయ సినీ పరిశ్రమలోనే ప్రథమం” అన్నారు. 

. @urstrulyMahesh SIR. #VIZAG loved our film. This is truly a huge moment. A Blockbuster review. An honest moment. Theater response to our film ❤️🇮🇳
P.s. now They are waiting for your response 🇮🇳#MajorTheFilm pic.twitter.com/QNFjsaFuqb— Adivi Sesh (@AdiviSesh) May 29, 2022