ప్రియాంక గాంధీకి కరోనా

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె కూతురు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రియాంకనే తెలియజేశారు. ప్రస్తుతం తాను క్వారంటైన్‌లో ఉన్నట్లు ప్రియాంక ట్వీట్ చేసింది.

“నాకు కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయి. అన్ని నిబంధనలు పాటిస్తూ.. ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నాను. ఇటీవల నన్ను కలిసినవారంతా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నా”నని రాసుకొచ్చారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం కోసం ప్రియాంక కష్టపడుతున్నారు. ఇందులో భాగంగా నవ సంకల్ప కార్యశాలకు హాజరయ్యారు. అయితే అరోగ్యానికి గురికావడంతో.. తన పర్యటనను అర్ధంతరంగా ముగించుకున్నారు. బుధవారం రాత్రే ఢిల్లీకి వెళ్లిపోయారు. తల్లికి కరోనా సోకడంతో ముందు జాగ్రత్తగా ఆమె వెళ్లినట్లు తెలుస్తోంది.