ప్రభాస్ ను కలిసిన లోకేష్

లోకేష్ కనగరాజ్ – ప్రస్తుతం సౌత్, నార్త్ లోనూ మారుమ్రోగిపోతున్న పేరు. ఖైదీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన లోకేష్.. కమల్ హాసన్ హీరోగా ఆయన చేసిన సినిమా విక్రమ్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఖైదీ పొలికలు కనిపించినా.. లోకేష్ రాత-తీత ఆకట్టుకున్నాయి. కమల్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్  ల నటన సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఆఖర్లో సూర్య ఎంట్రీ అదిరిపోయింది.

ఈ దర్శకుడి తదుపరి సినిమా విజయ్ (#Thalapathy67) తో ఉండనుంది. అయితే ఇటీవల లోకేష్ కనగరాజ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని కలిశాడట. ఓ పవర్ ఫుల్ కథని వినిపించారట. అయితే అది ప్రభాస్ కు నచ్చలేదని.. రిజెక్ట్ చేసినట్టు సమాచారం. ఇక సూర్య, కమల్ కాంబోలో విక్రమ్ 3 ప్లాన్ చేస్తున్నాడు లోకేష్. ఇందులో సూర్య ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. కమల్ గెస్ట్ రోల్ లో మెరుస్తాడని సమాచారం. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ విక్రమ్ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆ తర్వాత తదుపరి సినిమాపై ఫోకస్ చేయనున్నారు.